వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని గేట్స్ కళాశాల సమీపంలో గల 44 హైవేపై గురువారం ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

