వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలసలో హైకోర్టు ఆదేశాలతో ఓ మహిళకు నిలిచిపోయిన పింఛన్ను సచివాలయ సిబ్బంది అందజేశారు. భర్త మరణంతో స్పౌజ్ కేటగిరీలో పింఛన్ మంజూరైనా, రాజకీయ కక్షతో నిలిపివేశారని లక్ష్మీ ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు ఆమెకు 12 నెలల బకాయి పింఛన్తో పాటు ఆగస్టు నెల పింఛన్ను అధికారులు అందజేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

