వార్తలకు తిరిగి వెళ్లండి
అక్రమాలకు వేదికగా జీవీఎంసీ నిధులు

జీవీఎంసీ 5వ వార్డు సాయిరాం కాలనీ ఫేజ్-3 పరిధిలోని కొండవాలు ప్రాంతంలో జనసంచారం లేకపోయినా రూ.లక్షల ప్రజాధనంతో జీవీఎంసీ అధికారులు మెట్ల మార్గం, కాలువలు నిర్మించడం వివాదాస్పదమైంది.
గతంలోనే ఆక్రమణల ప్రయత్నాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నప్పటికీ, స్థానిక నాయకుల ఒత్తిళ్లతో జీవీఎంసీ అధికారులు దాదాపు రూ.36 లక్షల అంచనాతో మౌలిక వసతులు కల్పిస్తూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...