వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో సోమవారం విద్యుత్ స్తంభాలతో వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న 6 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

