వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం మండలంలోని ఈదుల నాగులపల్లి గ్రామ శివారులోని యూని యాడ్స్ కంపెనీ భూమిలో గుర్తుతెలియని పురుషుడి అస్థిపంజరం లభ్యమైంది. సమాచారం అందుకున్న బీడీఎల్ భానూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
అస్థిపంజరం సమీపంలో నీలం రంగు డ్రాయర్, షర్టు లభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతుడి వివరాలు తెలిసిన వారు బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు
Comments
Loading comments...

