వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మిర్చిని చైనా, శ్రీలంక దేశాలు తిరస్కరిస్తున్న నేపథ్యంలో, ఈ ఎగుమతి సమస్యల పరిష్కారానికి లాంఫామ్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో మంగళవారం ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ఉద్యాన వర్సిటీ, ఇండో-అమెరికన్ హైబ్రిడ్ సీడ్స్ సంస్థలు ఉమ్మడిగా దీనిని ఏర్పాటు చేస్తున్నాయి.
రసాయనాల్లేని సాగు పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలు, తెగుళ్ల అదుపుతో పాటు విదేశీ మార్కెట్ అవకాశాలపై నిపుణులు ఈ సెమినార్లో చర్చించనున్నారు.
Comments
Loading comments...

