వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామం నుండి పొన్నాలపల్లి, కోరుట్లపేట రహదారి కి అనుసంధానం చేసే మట్టి రోడ్డు గుంతలతో పూర్తిగా అధ్వానంగా మారింది. సుమారు మట్టి రోడ్డు కిలోమీటర్ దూరం ఉంటుంది.
నాగంపేట, మల్లుపల్లి గ్రామస్తులు నిత్యం ఈ రహదారి గుండా ప్రయాణాలు సాగిస్తుంటారు. రాత్రి వేళలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. బీటీ రోడ్డు వేయాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

