వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం BSR లేబర్ క్యాంపులో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికుడు మైల శ్రీరాములు (31) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.
ఛాతీనొప్పి రావడంతో తోటి కూలీలు అతడిని తుళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రిలో భద్రపరిచారు.
Comments
Loading comments...

