వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు మండలం కొమరారం గ్రామానికి చెందిన కాంపాటి సుందర్(42) గుండెపోటుతో మృతి చెందాడు. జీవనభృతి కోసం రెండు రోజుల క్రితం ఇల్లందు బృందంతో కలిసి గుంటూరు జిల్లా తెనాలికి వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
పార్థివదేహం మధ్యాహ్నం 2 గంటలకు స్వగ్రామానికి చేరుకోనుంది. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
Comments
Loading comments...

