వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాకి(M) ప్రియాగ్రహారంలో 1893లో జన్మించిన గరిమెళ్ల సత్యనారాయణ బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ కలం కదిలించిన అక్షర యోధుడు. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ గేయంతో తెలుగు ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించి, స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిలూదారు.
బ్రిటిష్ పాలకులను ఎదిరించి జైలుపాలైన ప్రజాకవి పోరాట పటిమ అనన్యసామాన్యం. 1958లో కన్నుమూసినా ఆయన అందించిన ఉద్యమ స్ఫూర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
Comments
Loading comments...

