వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో అధిక లోడుతో గ్రానైట్ రవాణా చేస్తున్న లారీలను గ్రామస్తులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. నిరంతరం భారీ లారీలు వెళ్లడం వల్ల రహదారులు గుంతలమయంగా మారి ప్రయాణానికి ఇబ్బందిగా మారాయని, అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ రవాణాను కట్టడి చేయాలని, దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి క్వారీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

