వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి గణేష్నగర్లోని మురళీకృష్ణ ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక అభిషేకం, లక్ష పుష్పార్చన, తులసీదళాలతో విశేష అర్చనలు చేపట్టారు.
స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, సభ్యులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

