వార్తలకు తిరిగి వెళ్లండి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. సుమారు 32 కిలోమీటర్ల గిరిమార్గంలో లక్షలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో ప్రదక్షిణ చేస్తున్నారు.
భక్తులకు తాగునీరు, ప్రసాదాలు, వైద్య సేవలు తదితర సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. గిరిమార్గం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...
