వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా భీమడోలులో గ్రామదేవతలకు గ్రామస్థులు శనివారం భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. మహిళలు ఎడ్లబండ్లు, కావిళ్లతో మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు.
శ్రీగంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ, పోతురాజు బాబులకు పూజలు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా సారె సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామ సుభిక్షం, పాడిపంటల సమృద్ధిని ఆకాంక్షించారు.
Comments
Loading comments...
