వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలంలోని గ్రామపంచాయతీల్లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. SIR సర్వే ద్వారా రూపొందించిన ఓటరు జాబితాను బీఎల్వోలు ఈ సభల్లో చదివి వినిపిస్తారని అన్నారు.
జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఏవైనా అభ్యంతరాలు, మార్పులు ఉంటే సూచనలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మండల ఓటర్లు, ప్రజాప్రతినిధులు సభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

