వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవుదామని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ కోరారు. బుధవారం పోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు.
గ్రామంలోని అన్ని కాలనీలలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జలపతి, ఈవో రాహుల్ ఉన్నారు.
Comments
Loading comments...

