వార్తలకు తిరిగి వెళ్లండి
నేతన్నలకు అండగా ప్రభుత్వం

చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా ఖాతాల్లో జమ చేయనుంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాది మంది కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. విద్యుత్ రాయితీలతో పాటు ఈ సాయం నేతన్నల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...