వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ పథకాలు చేర్చాలి

పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బనగానపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో క్లస్టర్ ఇన్ఛార్జులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
వైద్యం అవసరమైన పేదలకు కార్యకర్తలు అండగా ఉండి సీఎం సహాయనిధి అందేలా చూడాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...