వార్తలకు తిరిగి వెళ్లండి
జిన్నారంలో కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు

జిన్నారం మండలంలో ప్రభుత్వ భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, కొందరి అక్రమార్కులతో కుమ్మక్కు కావడంతో రాత్రికి రాత్రే నూతన నిర్మాణాలు వెలుస్తున్నాయి.
ఖాజీపల్లి, కిష్టాయపల్లి, అల్లీనగర్ తదితర ప్రాంతాల్లో సర్కారు జాగాలు కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే నామమాత్రపు చర్యలతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
Comments
Loading comments...