వార్తలకు తిరిగి వెళ్లండి

వల్లభాపురం నుంచి ఈమని వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి, గుంటూరు వెళ్లేందుకు ఇది సమీప మార్గం కావడంతో నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉంటుంది.
రోడ్డుపై ఉన్న గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఓ యువకుడు కూడా బైక్ ప్రమాదంలో మృతి చెందాడని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.
Comments
Loading comments...

