వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్తాపం చెందిన తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని అతని తల్లి కన్నమ్మ లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటుకూరు రోడ్డు గాంధీనగర్కి చెందిన గోపి (31) ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకొన్నాడు.
2 నెలల కిందట గోపీ, అతని భార్యకు మధ్య విబేధాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో గోపి కనిపించడం లేదని అతని తల్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

