వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలో గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు 23 కేజీల భారీ పండుగప్ప చిక్కింది. యానాం మార్కెట్కు తరలించిన ఈ అరుదైన చేపను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
అనంతరం నిర్వహించిన వేలంలో కోలాటి దేవి అనే వ్యాపారి ఈ భారీ చేపను రూ.16 వేలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫొటోలు, విశేషాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Comments
Loading comments...

