వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలోని శ్రీవీరాంజనేయస్వామి దేవస్థానానికి చెందిన 2.77 ఎకరాల భూమి రికార్డుల్లో ఉన్నా క్షేత్రస్థాయిలో గుర్తించలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణలపై ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.
సంయుక్త సర్వేలో భూములు గ్రామకంఠంలో విలీనమయ్యాయని అధికారులు తెలిపారు. పాత రికార్డులను పరిశీలించి భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటామని దేవాదాయ శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...
