వార్తలకు తిరిగి వెళ్లండి
కొణిజెర్లలో గోద్రెజ్ పామాయిల్ యూనిట్ ప్రారంభం

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం అంజనాపురంలో రూ. 300 కోట్లతో ఏర్పాటు చేసిన గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ పామాయిల్ యూనిట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు.
మెరుగైన లాభాల కోసం రైతులు వాణిజ్య పంటలు సాగు చేయాలని భట్టి పిలుపునిచ్చారు. 113 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ పరిశ్రమ ద్వారా దేశీయంగానే ఆయిల్ ఉత్పత్తి పెరిగి, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...