Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరదలపై అప్రమత్తం

రేఖ దేవి Jun 27, 2026 7:24 AM భద్రాద్రి కొత్తగూడెం 7 viewsabout 2 hours ago
గోదావరి వరదలపై అప్రమత్తం - Udayam Digital
గోదావరి వరదల నేపథ్యంలో ప్రాణ, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. భద్రాచలం, పినపాక పరివాహక ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆయన జిల్లా యంత్రాంగానికి సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వరదల వల్ల రహదారులు మూసుకుపోయే గ్రామాలను గుర్తించాలని మంత్రి పేర్కొన్నారు. అత్యవసర వైద్యం, నిత్యావసరాల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...