వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడికి శిక్ష పడేలా ప్రవీణ్ కుమార్ పనిచేయడం వల్లే, కక్షతో భద్రతను తగ్గించారని ఆయన విమర్శించారు.
భద్రతను ఎందుకు తొలగించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే భద్రతను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని శ్యామ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comments
Loading comments...

