Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 7:24 PM మహబూబ్‌నగర్General
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ - Udayam
గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. మండపాల భద్రత, విద్యుత్, లౌడ్స్పీకర్లు, ట్రాఫిక్, నిమజ్జన ఊరేగింపుపై అవగాహన కల్పించారు. డీజేలు, ఆయుధాలు, బాణాసంచా వినియోగించరాదని తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు లౌడ్స్పీకర్లకు అనుమతి లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...