Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 8:50 PM విజయనగరంGeneral
గణేశ్ ఉత్సవాలకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని APEPDCL SC లక్ష్మణరావు శుక్రవారం తెలిపారు. చీపురుపల్లి కార్యాలయంలో మాట్లాడుతూ.. గణేశ్ మండపాలు ఏర్పాటు చేసుకున్న వారు స్థానిక ఏఈకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూరల్ ఏరియాలో 3కిలో వాట్, అర్బన్ ఏరియాలో 5కిలో వాట్ వరకు ఉచితంగా సరఫరా ఉంటుందని వెల్లడించారు. మండపాల వద్ద లైటింగ్ లోడ్ ఎలక్ట్రికల్ బోర్డు చెప్పే విధంగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...