వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీబుగ్గ పోలీసులు 18.415 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పలాస రైల్వే కాలనీ 3వ లైన్ జంక్షన్ వద్ద తనిఖీల్లో 9 ప్యాకెట్లలో గంజాయి గుర్తించారు. రెండు సెల్ఫోన్లు, రూ.1,760 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా నుంచి విజయవాడకు తరలిస్తుండగా పట్టుబడినట్లు సీఐ జి. రామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

