వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వీసీ గంగాధరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.
అంతకుముందు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, యువత, విద్యార్థులు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

