Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం ఆసుపత్రిలో మొక్కలు నాటిన న్యాయమూర్తి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 9:33 AM విజయనగరంGeneral
గజపతినగరం ఆసుపత్రిలో మొక్కలు నాటిన న్యాయమూర్తి - Udayam
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో గజపతినగరం కోర్టు న్యాయమూర్తి విజయ్‌ రాజ్‌ కుమార్‌ శనివారం ఉదయం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అత్యవసర విభాగం గది, ల్యాబ్‌, ప్రసూతి గదులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...