Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనులు భూపోరాటం.. అరెస్టు చేసిన పోలీసులు

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 8:41 PM విజయనగరంGeneral
గిరిజనులు భూపోరాటం.. అరెస్టు చేసిన పోలీసులు - Udayam
రామభద్రపురం మండలం జన్నివలస రెవెన్యూలో గిరిజనులు సాగు చేస్తున్న భూమిని తీసుకోవద్దని కోరుతూ బుధవారం గిరిజనులు భూపోరాటం చేశారు. సాలూరు మండలం పుల్లేరు గుడ్డువలస, వంగర గుడ్డువలస, జాతరమ్మ కొత్తపేట గిరిజనులు జన్నివలస రెవెన్యూలో భూమి సాగు చేస్తున్నారు. భూమిని ఎపిఐఐసికు కేటాయించడంతో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి రామభద్రపురం, బాడంగి, తెర్లాం పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Comments

G
Loading comments...