Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన బాలుడి మృతిపై సమగ్ర విచారణ జరపాలి: ఆదివాసి జేఏసీ

Follow Udayam on Google
B Ganga Sep 18, 2026 11:20 AM పార్వతీపురం మన్యంGeneral
గిరిజన బాలుడి మృతిపై సమగ్ర విచారణ జరపాలి: ఆదివాసి జేఏసీ - Udayam
సీతంపేట మండలం ఎర్రన్నగూడకు చెందిన 7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్(12) EMRS అనసభద్ర పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదివాసీ JAC కోరింది. కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేసేందుకు CCTV ఫుటేజీ, విద్యార్థుల వాంగ్మూలాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేసింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని అర్పిత్ కుటుంబానికి న్యాయం చేయాలని జేఏసీ కోరింది.

Comments

G
Loading comments...