Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

Follow Udayam on Google
Naresh Aug 31, 2026 11:27 PM నిర్మల్General
ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి - Udayam
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకుని జీపులో తిరిగి వస్తుండగా, వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ దాగాం తులసిరాం (28) కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరగా పలువురు చికిత్స పొందుతున్నారు.

Comments

G
Loading comments...