వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో దివంగత మాజీ ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జోహార్ జోహార్ వైయస్సార్ జోహార్ తదితర నినాదాలు చేశారు. గజపతినగరం జడ్పిటిసి గార తౌడు, మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

