వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట ప్రధాన రహదారిలోని శ్రీ నూకాంబిక దేవి ఆలయ వార్షికోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి.
ఆలయం ప్రతిష్ఠించి 23 సంవత్సరాలు పూర్తయిందని ప్రధాన అర్చకులు ఇప్పిలి రమణ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు విరివిగా పాల్గొని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Comments
Loading comments...

