వార్తలకు తిరిగి వెళ్లండి
జీహెచ్ఎంసీలో రూ.50 కోట్ల గోల్మాల్

జీహెచ్ఎంసీలో బిల్లుల చెల్లింపుల్లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. లెక్కలు మార్చి ఒకే గుత్తేదారుకు రెండుసార్లు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో దాదాపు రూ.50 కోట్లు పక్కదారి పట్టినట్లు అంచనా.
మూడు కార్పొరేషన్ల ఏర్పాటులో భాగంగా ఖాతాల విభజన చేపట్టిన సమయంలో ఈ అక్రమాలు బయటపడ్డాయి. ఆడిట్, ఫైనాన్స్ విభాగాల సిబ్బంది, ఏజెన్సీల పాత్రపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...