Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గీతం వర్సిటీ విద్యార్థిని అదృశ్యం

పవని రెడ్డి Jul 24, 2026 11:13 AM సంగారెడ్డిabout 2 hours ago
గీతం వర్సిటీ విద్యార్థిని అదృశ్యం - Udayam Digital
సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ నుంచి అదృశ్యమైంది. ఈ నెల 22న సాయంత్రం అవుటింగ్ పేరుతో బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాకపోవడంతో కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, వారి ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...