వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని ఖమ్మం గౌడ సంఘానికి ప్రభుత్వం కేటాయించిన 30 గుంటల స్థలంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న గౌడ సంక్షేమ భవన్ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ గౌడ్, హస్తకళల కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, రాయల నాగేశ్వరరావు, నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

