వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా ప్రమాదకరంగా మారుతోంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయి, జిల్లా మీదుగానే ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. తరచూ పట్టుబడుతున్న నిందితుల్లో స్థానికులు ఉండటం గమనార్హం.
రైల్వేలు, రహదారుల ద్వారా జరుగుతున్న రవాణాను అడ్డుకోవడానికి పోలీసు, ఆబ్కారీ శాఖల మధ్య సమన్వయం అవసరం. కఠిన దాడులతో పాటు, యువతలో గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

