వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 14 నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో నిర్వాహకులు ఇప్పటికే మండపాలు సిద్ధం చేశారు. విగ్రహాల తయారీదారులు వివిధ ఆకృతుల్లో రంగురంగుల విగ్రహాలను తయారు చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచారు.
అయిజలోనూ సుందరంగా తయారు చేసిన విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

