Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు రైతులకు డీబీటీ ద్వారా నిధులు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 7:17 PM అమరావతిGeneral
పొగాకు రైతులకు డీబీటీ ద్వారా నిధులు - Udayam
రాజధాని అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. పొగాకు రైతులకు డీబీటీ ద్వారా రూ.94 కోట్ల ఆర్థికసాయం, తోతాపురి మామిడికి మద్దతు ధర కోసం రూ.281 కోట్ల నిధుల ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రిజర్వాయర్‌ కేజ్‌ కల్చర్‌ పాలసీ ముసాయిదాకు ఆమోదముద్ర వేసి, మత్స్యరంగంలో కేజ్‌ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...