వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ నిర్వహించిన వాహనాల బహిరంగ వేలంలో 31 వాహనాలు విక్రయమై రూ.4,46,260 ఆదాయం వచ్చినట్లు జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి తెలిపారు. మొత్తం 32 వాహనాలకు వేలం నిర్వహించగా 31 వాహనాలు అమ్ముడయ్యాయి.
96 టెండర్ దరఖాస్తు ఫారాల విక్రయం ద్వారా మరో రూ.56,640 ఆదాయం సమకూరిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేలం ప్రక్రియ నిర్వహించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
