Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీశాఖ వాహనాల వేలంతో రూ.4.46 లక్షల ఆదాయం

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 03, 2026 6:55 PM ఆసిఫాబాద్తెలంగాణ
అటవీశాఖ వాహనాల వేలంతో రూ.4.46 లక్షల ఆదాయం - Udayam Digital
ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ నిర్వహించిన వాహనాల బహిరంగ వేలంలో 31 వాహనాలు విక్రయమై రూ.4,46,260 ఆదాయం వచ్చినట్లు జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి తెలిపారు. మొత్తం 32 వాహనాలకు వేలం నిర్వహించగా 31 వాహనాలు అమ్ముడయ్యాయి. 96 టెండర్ దరఖాస్తు ఫారాల విక్రయం ద్వారా మరో రూ.56,640 ఆదాయం సమకూరిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేలం ప్రక్రియ నిర్వహించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...