వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
తిరుమలకు 350 మంది భక్తుల పాదయాత్ర

కమలాపురం మండలం పెద్దచెప్పలి గ్రామం నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం సుమారు 350 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణచైతన్యరెడ్డి పెద్దచెప్పలి ఎల్లమ్మ దేవాలయం వద్ద ఈ యాత్రను ప్రారంభించారు.
అంతకుముందు ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర సజావుగా సాగాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...