Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గాన్‌లో భారీ వరదలు.. 20 మంది మృతి

వినయ్ కుమార్ Jul 21, 2026 8:25 AM అల్ ఇండియా about 8 hours ago
అఫ్గానిస్తాన్‌లోని నూరిస్తాన్ ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పరూన్ నగర మేయర్‌తో పాటు 100 మందికిపైగా గల్లంతవ్వగా, వందలాది దుకాణాలు కొట్టుకుపోయి భారీగా ఆస్తి నష్టం జరిగింది. సహాయక పరికరాల కొరత ఉండటంతో స్థానికులు చేతులతోనే బురద తొలగిస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాధితులకు అవసరమైన సహాయం, పునరావాసం కల్పిస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.

Comments

G
Loading comments...