వార్తలకు తిరిగి వెళ్లండి
ఉప్పొంగుతున్న గోదావరి

మహారాష్ట్రలో గోదావరి నది తీవ్ర ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్ జిల్లాలోని సైకెడా వద్ద వరద ప్రవాహం పంటపొలాలు, ఇళ్లను ముంచెత్తడంతో అధికారులు పలు జలాశయాల గేట్లను తెరిచారు.
గోదావరిపై ప్రధానమైన జయక్వాడి డ్యామ్ పూర్తి సామర్థ్యం 102 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 50 టీఎంసీలు దాటింది. ఈ డ్యామ్ పూర్తిగా నిండితే తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుంది.
Comments
Loading comments...