వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. కళాశాలకు ఇరువైపుల రహదారుల నుంచి వచ్చిన వరద నీరు దిగువ ప్రాంతంలో ఉన్న మైదానంలోకి చేరడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నీరు నిల్వ ఉండటంతో దోమల వ్యాప్తి, వ్యాధుల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...
