వార్తలకు తిరిగి వెళ్లండి
ఎగువ ప్రాంతాల వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు 32 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది.
విద్యుదుత్పత్తి అనంతరం దాదాపు 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, ఈ జలాలు త్వరలోనే శ్రీశైలం జలాశయానికి చేరుకోనున్నాయి.
Comments
Loading comments...