వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ విమానాశ్రయం నుంచి నేటి నుంచి వారణాసి, కోల్కతాకు రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసులను వారానికి మూడు రోజులపాటు నిర్వహించనుంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. కొత్త సర్వీసులతో విజయవాడ నుంచి ఉత్తర భారత ప్రాంతాలకు విమాన ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.
Comments
Loading comments...

