వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రానున్న ఐదు రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట సహా పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని ప్రజలకు సూచించింది.
Comments
Loading comments...

